Gujarat: కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్ విసిరిన అగంతకుడు

ABN , First Publish Date - 2022-10-02T19:19:13+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ అగంతకుడు ప్లాస్టిక్ వాటర్..

Gujarat: కేజ్రీవాల్‌పై వాటర్ బాటిల్ విసిరిన అగంతకుడు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ను టార్గెట్ చేస్తూ అగంతకుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ విసిరిన ఘటన గుజరాత్‌ (Gujarat)లో చోటుచేసుకుంది. గుజరాత్ రాజ్‌కోట్ సిటీలో నవరాత్రి వేడుకల్లో భాగంగా జరుగుతున్న ఓ గార్బా ఈవెంట్‌లో శనివారంనాడు ఈ ఘటన జరిగినట్టు పార్టీ నేతలు తెలిపారు.


 ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో గార్బా నృత్యంలో పాల్గొన్న వారిని కలిసేందుకు కేజ్రీవాల్ వెళ్తుండగా వెనుక వైపు నుంచి ఎవరో వాటర్ బాటిల్ విసిరారు. అయితే ఆ బాటిల్ ఆయనకు తగలకుండా తల మీద నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో కేజ్రీవాల్ వెంట భద్రతా సిబ్బంది, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. కాగా, కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని బాటిల్ విసిరినట్టు కనిపిస్తోందని, అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదని ఆప్ మీడియా కోఆర్డినేటర్ సుకంజ్‌రాజ్ తెలిపారు. డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన సాగిస్తున్నారు. సిటీలో జరుగుతున్న మరో గార్బా ఈవెంట్‌లో మాన్ పాల్గొన్నారు. సురేంద్ర నగర్, ఖేడ్‌బ్రహ్మ టౌన్‌లో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉభయులూ పాల్గొంటున్నారు.

Updated Date - 2022-10-02T19:19:13+05:30 IST