Vande Bharat trains: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్
ABN , First Publish Date - 2022-09-10T13:20:46+05:30 IST
దేశంలో రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శాఖ(Indian Railways) తాజాగా శుభవార్త(good news) వెల్లడించింది...
న్యూఢిల్లీ: దేశంలో రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శాఖ(Indian Railways) తాజాగా శుభవార్త(good news) వెల్లడించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో వందేభారత్ హైస్పీడ్ రైళ్లను(New Vande Bharat trains) త్వరలో ప్రవేశపెట్టాలని(launched soon) రైల్వేశాఖ నిర్ణయించింది.గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో నడిచే ఈ రైళ్లలో ప్రయాణికులకు(passengers) అత్యుత్తమమైన అప్ గ్రేడ్ సౌకర్యాలు అందించనుంది. ఈ రైలులో ప్రయాణికులకు వైఫై సౌకర్యం, కూడా కల్పించనున్నారు. 15 శాతం ఎక్కువ ఎనర్జీ ఎఫెక్టివ్ ఏసీలు, డస్ట్-ఫ్రీ క్లీన్ ఎయిర్ కూలింగ్ ట్రాక్షన్ మోటారు వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలవుతోంది.
వందే భారత్ రైళ్లలో(Vande Bharat Express) 32-అంగుళాల ఎల్సీడీ టీవీలు LCD కూడా ఉంటాయి.చండీగఢ్ నగరంలోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (CSIO) సిఫార్సుల ప్రకారం సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ లేకుండా స్వచ్ఛమైన గాలి ప్రయాణికులకు అందేలా సౌకర్యాలు కల్పించారు. 2023 నాటికి 75 వందేభారత్ రైళ్లను తయారు చేయాలని భారతీయ రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.