ఎంపీ అరుణ్ కుమార్ పరారీలో ఉన్నారు
ABN , First Publish Date - 2022-11-24T01:40:11+05:30 IST
షాజహాన్పూర్ బీజేపీ ఎంపీ అరుణ్ కుమార్ సాగర్ పరారీలో ఉన్నారని ఇక్కడి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది.
యూపీలో ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు
షాజహాన్పూర్, నవంబరు 23: షాజహాన్పూర్ బీజేపీ ఎంపీ అరుణ్ కుమార్ సాగర్ పరారీలో ఉన్నారని ఇక్కడి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది. 2019 ఎన్నికల సమయంలో ఆయన ప్రచార సామగ్రిని అప్పటి ఎస్డీఎం సదర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు విచారణ కోసం కోర్టు పలుమార్లు సమన్లు ఇచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో ఎంపీ పరారీలో ఉన్నారని తేల్చిన న్యాయస్థానం, ఆయనపై నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. తమ ఆదేశాలను ఎంపీ నివాసంతోపాటు బహిరంగ ప్రదేశాల్లోనూ అతికించాలని అధికారులను ఆదేశించింది.