Minister: మంత్రి అన్బిల్ మహేష్కు డెంగ్యూ
ABN , First Publish Date - 2022-09-28T13:03:05+05:30 IST
రాష్ట్ర పాఠశాల శాఖ మంత్రి అన్బిల్ మహేష్(Minister Anbil Mahesh) డెంగ్యూ జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని కుటుంబీకులు ఆళ్వారుపేటలో
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 27: రాష్ట్ర పాఠశాల శాఖ మంత్రి అన్బిల్ మహేష్(Minister Anbil Mahesh) డెంగ్యూ జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని కుటుంబీకులు ఆళ్వారుపేటలో వున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఈ జ్వరాలకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అన్బిల్ మహేష్ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన్ని పరీక్షించిన వైద్యులు డెంగ్యూ జ్వరం బారిన పడినట్లు తేల్చారు. కాగా మంత్రికి రెండు రోజుల పాటు చికిత్స అవసరమని, అనంతరం ఆయన్ని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు పేర్కొన్నారు.