టీ బీసీ కమిషన్ ముందే వాదనలు వినిపించండి
ABN , First Publish Date - 2022-10-12T08:03:35+05:30 IST
ముదిరాజ్ సామాజికవర్గాన్ని బీసీ(ఏ)లోనే కొనసాగించే విషయమై తెలంగాణ బీసీ కమిషన్ ముందే వాదనలు వినిపించాలని ముదిరాజ్ మహాసభకు సుప్రీంకోర్టు సూచించింది.
ఏపీ ముదిరాజ్ మహాసభకు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ముదిరాజ్ సామాజికవర్గాన్ని బీసీ(ఏ)లోనే కొనసాగించే విషయమై తెలంగాణ బీసీ కమిషన్ ముందే వాదనలు వినిపించాలని ముదిరాజ్ మహాసభకు సుప్రీంకోర్టు సూచించింది. 2009లో ముదిరాజ్ సామాజికవర్గాన్ని బీసీ(డీ) నుంచి బీసీ(ఏ)కి మార్చుతూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సవాలు చేస్తూ 2010లో ఏపీ ముదిరాజ్ మహాసభ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణను ముగించింది.