ఆల్మట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్ర అభ్యంతరం
ABN , First Publish Date - 2022-12-30T00:52:28+05:30 IST
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇంతలోనే జలవివాదం తెరపైకి వచ్చింది.
డ్యాం పనులు ఆపాలి..
లేకుంటే సుప్రీంకు వెళ్తాం: ఫడణవీస్
బెంగళూరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇంతలోనే జలవివాదం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించే కృష్ణా నదీ జలాల విషయమై మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరం తెలిపింది. కృష్ణానదిపై బాగల్కోట జిల్లాలో ఉండే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచాలన్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మహా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే తమ రాష్ట్ర పరిధిలోని కొల్హాపుర, సాంగ్లి ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, దానిపై తాము చేస్తున్న అధ్యయనం ముగిసేదాకా కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని మహారాష్ట్ర శానసభలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన గురువారం సమాఽధానమిచ్చారు.