30 సెకన్లలో కొవిడ్ నిర్ధారణ!
ABN , First Publish Date - 2022-04-10T08:25:29+05:30 IST
కరోనా అనుమానంతో ఆర్టీపీసీఆర్ పరీక్షకు వెళ్తే ఫలితం కోసం ఇప్పటికీ 24 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది.
న్యూయార్క్, ఏప్రిల్ 9: కరోనా అనుమానంతో ఆర్టీపీసీఆర్ పరీక్షకు వెళ్తే ఫలితం కోసం ఇప్పటికీ 24 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో మరింత సమయం కూడా పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధకుల బృందం ఓ పరికరాన్ని(డివైజ్) రూపొందించింది. తమ టెస్టింగ్ డివైజ్ సాయంతో 30 సెకన్లలోనే కరోనా పాజిటివ్ లేదా నెగెటివ్ అనే దాన్ని నిర్ధారించవచ్చని ఆ బృం దం చెబుతోంది. పీసీఆర్(పాలీమెరేస్ చెయిన్ రియాక్షన్) పరీక్షల మాదిరిగానే తమ డివైజ్ కూడా 90ు కచ్చితమైన ఫలితాలిస్తుందంటోంది. సలైవా(ఉమ్ము) నమూనాల ఆధారంగా వైరస్, యాంటీబాడీలను లెక్కగట్టే ఈ పరికరానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి లభించాల్సి ఉంది.
మూడో వంతు జనాభాకు అందని వ్యాక్సిన్
ప్రపంచవ్యాప్తంగా భారీగా నమోదవుతున్న కరోనా కేసులపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. సగటున ప్రతి 4 నెలలకు ఓసారి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని, ఆ ప్రభావంతో కేసులు భారీగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. పరిస్థితులు చూస్తుంటే కరోనా ఇప్పట్లో అంతమయ్యేలా లేదన్నారు. ఆసియాలో వ్యాప్తి తీవ్రంగా ఉందని, కొత్త వేవ్ యూర్పను కమ్మేస్తోందన్నారు.