PM Modi event:కవర్ చేసే జర్నలిస్టులు క్యారెక్టర్ సర్టిఫికెట్ సమర్పించాలి...జిల్లా అధికారుల సంచలన ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-10-04T13:51:19+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ ( Himachal) అధికారులు సాక్షాత్తూ జర్నలిస్టులకే షాక్ ఇచ్చిన ఘటన...

PM Modi event:కవర్ చేసే జర్నలిస్టులు క్యారెక్టర్ సర్టిఫికెట్ సమర్పించాలి...జిల్లా అధికారుల సంచలన ఉత్తర్వులు

చండీఘడ్ (హిమాచల్ ప్రదేశ్): హిమాచల్ ప్రదేశ్ ( Himachal) అధికారులు సాక్షాత్తూ జర్నలిస్టులకే షాక్ ఇచ్చిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్‌ పర్యటనను కవర్ చేసే జర్నలిస్టులు యాక్సెస్, సెక్యూరిటీ పాస్‌ల కోసం క్యారెక్టర్ సర్టిఫికెట్(Journalists) సమర్పించాలని హిమాచల్ అధికారులు తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కులూలో, మండిలో జరగాల్సిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.(PM Modi event) ప్రధాని పర్యటన కవర్ చేసే ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రింట్, డిజిటల్,న్యూస్ టెలివిజన్ జర్నలిస్టులు మాత్రమే కాదు, ఆల్ ఇండియా రేడియో (AIR),దూరదర్శన్‌తో సహా ప్రభుత్వ మీడియా ప్రతినిధులు కూడా క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్‌లను(character certificates) తీసుకురావాలని డీపీఆర్ఓ కోరారు. 


ఈ విషయంపై సెప్టెంబర్ 29న పోలీసులు అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.అన్ని పత్రికల ప్రెస్ కరస్పాండెంట్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లు, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో బృందాల జాబితాను వారి పాత్ర ధృవీకరణ సర్టిఫికెట్ తో పాటు అందించాలని జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (DPRO)నోటిఫికేషన్ ని జారీ చేశారు.‘‘మోదీ జీ తొలిసారిగా హిమాచల్ రాష్ట్రాన్ని సందర్శించడం లేదు. క్యారెక్టర్ సర్టిఫికెట్ సమర్పించాలనే డిమాండ్ జర్నలిస్టులకు అవమానకరం, మీడియా కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రయత్నించారు’’ అని సీనియర్ జర్నలిస్టు పండిట్ అన్నారు.


జర్నలిస్టులపై విధించిన ఆంక్షలను హిమాచల్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన అధికార ప్రతినిధి నరేష్ చౌహాన్ కూడా ఖండించారు.ఈ చర్య మీడియా స్వేచ్ఛకు ఈ ఉత్తర్వు విరుద్ధమని నరేష్ అన్నారు.జర్నలిస్టులకు క్యారెక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి అని బిలాస్‌పూర్‌ డీపీఆర్వో చెప్పారు.ఎస్పీ, సీఐడీ విభాగాలు క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నాయని డీపీఆర్వో కుల్దీప్ గులేరియా తెలిపారు.


Updated Date - 2022-10-04T13:51:19+05:30 IST