ఇరాన్లో ఆందోళనకారుడి ఉరి
ABN , First Publish Date - 2022-12-10T01:12:35+05:30 IST
పారా మిలటరీ అధికారిని గాయపరిచాడన్న కారణంతో ఒక ఆందోళనకారుడ్ని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. ‘
దేవునిపై యుద్ధం చేసినట్టు ప్రభుత్వం ప్రకటన
టెహ్రాన్, డిసెంబరు 9: పారా మిలటరీ అధికారిని గాయపరిచాడన్న కారణంతో ఒక ఆందోళనకారుడ్ని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. ‘దేవునిపై యుద్ధం చేస్తున్నందుకు’ ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు నెల నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 23న టెహ్రాన్లో జరిగిన ఆందోళనలో బసిజ్ పారామిలటరీకి చెందిన ఓ అధికారిని కత్తితో పొడిచి గాయపరిచాడన్న కారణంతో మెహసెన్ శేఖరి అనే ఉద్యమకారునికి ఇంత తీవ్రమైన శిక్ష విధించింది. దేశంలో ఆందోళనలు మొదలయిన అనంతరం అమలయిన తొలి మరణశిక్ష ఇదే కావడం గమనార్హం.