Govt doctor: ప్రభుత్వ వైద్యుల ఆందోళన
ABN , First Publish Date - 2022-09-14T15:56:06+05:30 IST
తమ వేతనాలను పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు(Government hospital doctors) మంగళవారం ఆందోళనకు
చెన్నై, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తమ వేతనాలను పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు(Government hospital doctors) మంగళవారం ఆందోళనకు దిగారు. నగరంలోని ఓమండూరార్ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, జీహెచ్ తదితర ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వరిస్తూనే తమ డిమాండ్లతో ఉన్న బ్యాడ్జీలు ధరించి విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ ప్రదర్శనను పది రోజులపాటు నిర్వహిస్తామని, ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల ఎదుట ఆందోళన, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని వైద్యుల సంఘం నాయకులు ప్రకటించారు.