truck runs over people: రోడ్డు డివైడర్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు...నలుగురి మృతి
ABN , First Publish Date - 2022-09-21T14:36:18+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున దారుణ ఘటన జరిగింది...
మరో ముగ్గురికి గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున దారుణ ఘటన జరిగింది. ఢిల్లీ నగరంలోని సీమాపురి(Seemapuri) రోడ్డు డివైడరుపై నిద్రిస్తున్న(sleeping on a road divider) వారిపై వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకుపోయింది.(truck ran over them)ఈ ఘటనలో నిద్రపోతున్న వారిలో నలుగురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.(truck runs over people sleeping) నిద్రపోతున్న వారిపైకి దూసుకెళ్లి ప్రాణాలు బలిగొన్న ట్రక్కును కనుగొనేందుకు ఢిల్లీ పోలీసులు(delhi police) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను జీటీబీ ఆసుపత్రికి తరలించారు.
ట్రక్కు నిద్రపోతున్న వారిపైకి దూసుకురావడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో క్షతగాత్రుడు మార్గమధ్యంలో మరణించాడు. మరో వ్యక్తికి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వస్తున్న ట్రక్కు సీమపురిలోని డీటీసీ డిపో వద్ద రెడ్ లైట్ ను క్రాస్ చేస్తూ నిద్రపోతున్న వారిపైకి దూసుకెళ్లింది. మృతుల్లో కరీం(52, ఛోటే ఖాన్ (25), షాఆలం(38), రాహుల్ (45)ఉన్నారు.ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.