Nagpurలో ట్రక్కును ఢీకొన్న కారు...ఐదుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-07T12:30:01+05:30 IST

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు...

Nagpurలో ట్రక్కును ఢీకొన్న కారు...ఐదుగురి దుర్మరణం

నాగ్‌పూర్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు.శుక్రవారం అర్దరాత్రి నాగ్‌పూర్ జిల్లాలో వేగంగా వస్తున్న మల్టీ యుటిలిటీ కారు వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురి మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు చెప్పారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.టవేరా వాహనం ఉమ్రేడ్ నుంచి నాగపూర్ వైపు వెళుతుండగా విహిర్ గావ్ సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, మృతులను ఇంకా గుర్తించలేదని డీసీపీ నూరుల్ హసన్ చెప్పారు.


Read more