Speed ​​up: ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంపు

ABN , First Publish Date - 2022-10-08T14:28:28+05:30 IST

చెన్నై నుంచి గూడూరు మీదుగా వివిధ నగరాలకు వెళ్లే 20 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంచినట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. ఆ మార్గంలో గంటకు 148

Speed ​​up: ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంపు

ఐసీఎఫ్‌(చెన్నై), అక్టోబరు 7: చెన్నై నుంచి గూడూరు మీదుగా వివిధ నగరాలకు వెళ్లే 20 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంచినట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. ఆ మార్గంలో గంటకు 148 కి.మీ వేగంతో 84 నిమిషాల్లో సూపర్‌ఫాస్ట్‌ రైలు ట్రయల్‌ రన్‌ గురువారం నిర్వహించారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ, నగరం నుంచి ఢిల్లీ, హౌరా, జైపూర్‌, లక్నో, హైదరాబాద్‌ తదితర నగరాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగాన్ని పెంచామని, దీని ద్వారా ప్రయాణ సమయం 30 నిమిషాలు ఆదా అవుతుందని తెలిపారు. ఇదే విధంగా చెన్నై-రేణిగుంట, చెన్నై-విల్లుపురం-తిరుచ్చి-దిండుగల్‌ మార్గాల్లో 2024-25 సంవత్సరంలో రైళ్లవేగం పెంచనున్నామన్నారు.

Updated Date - 2022-10-08T14:28:28+05:30 IST