Kejriwal Vs Delhi L-G : నా భార్య అయినా ఇన్ని ప్రేమ లేఖలు రాయలేదు : కేజ్రీవాల్
ABN , First Publish Date - 2022-10-06T23:23:55+05:30 IST
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (V K Saxena)పై ఆ
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (V K Saxena)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గురువారం విరుచుకుపడ్డారు. ‘‘మీరు రాసినన్ని ప్రేమ లేఖలు నా భార్య అయినా నాకు రాయలేదు’’ అన్నారు. రోజూ ఎల్జీ తిడుతున్నన్ని తిట్లను తన భార్య అయినా తనను తిట్టడం లేదన్నారు. ‘‘కాస్త చల్లబడండి’’ అని చెప్పారు.
కేజ్రీవాల్ గురువారం ఇచ్చిన ట్వీట్లో, రోజూ ఎల్జీ వీకే సక్సేనా తిడుతున్నన్ని తిట్లను తన భార్య అయినా తనను తిట్టడం లేదన్నారు. గడచిన ఆరు నెలల్లో ఎల్జీ తనకు రాసినన్నిప్రేమ లేఖలను తన భార్య తన జీవితం మొత్తంలో రాయలేదన్నారు. ఎల్జీ గారూ కాస్త చల్లబడండని కోరారు. కాస్త చల్లబడాలని మీ సూపర్ బాస్కు కూడా చెప్పండని కోరారు.
వీకే సక్సేనా ఇటీవల కేజ్రీవాల్కు రాసిన లేఖల్లో, గాంధీ జయంతినాడు రాజ్ఘాట్కు హాజరు కాకపోవడం గురించి ప్రశ్నించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చెట్లను తొలగించడానికి అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతుండటం గురించి ప్రశ్నించారు.
సక్సేనా, కేజ్రీవాల్ మధ్య సత్సంబంధాలు కొరవడిన సంగతి తెలిసిందే.