Earthquake: ఢిల్లీలో 20 రోజుల్లో మూడోసారి భూప్రకంపనలు

ABN , First Publish Date - 2022-11-30T05:46:38+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మంగళవారం రాత్రి మళ్లీ భూకంపం సంభవించింది....

Earthquake: ఢిల్లీలో 20 రోజుల్లో మూడోసారి భూప్రకంపనలు
Earthquake Hits Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మంగళవారం రాత్రి మళ్లీ భూకంపం సంభవించింది.మంగళవారం దేశ రాజధానిలో స్వల్ప భూకంపం సంభవించింది.(Earthquake)మంగళవారం రాత్రి న్యూఢిల్లీకి పశ్చిమాన సంభవించిన (Hits Delhi)భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదయ్యాయి.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) ప్రకారం భూకంపం యొక్క లోతు భూమి నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో ఉంది.

ఢిల్లీ,పరిసర ప్రాంతాల్లో నవంబర్ గతంలో రెండు భూకంపాలు సంభవించాయి.నవంబర్ 9వతేదీన నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రభావం ఢిల్లీలోనూ చూపించింది. నవంబర్ 12వతేదీన నేపాల్‌లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత కూడా ఢిల్లీలోనూ బలమైన ప్రకంపనలు సంభవించాయి.కేవలం 20 రోజుల్లో 3వసారి ఢిల్లీలో 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Updated Date - 2022-11-30T05:48:42+05:30 IST