RBI Monetary Policy: రుణం తీసుకోవాలనుకుంటున్నారా?.... మీకు చేదు వార్త....
ABN , First Publish Date - 2022-09-30T16:11:07+05:30 IST
రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుక్రవారం చేదువార్త వినబడుతోంది
న్యూఢిల్లీ : రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుక్రవారం చేదువార్త వినబడుతోంది. భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) రెపో రేటు (Repo Rate)ను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఇది 5.90 శాతానికి చేరింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) ఈ నిర్ణయం తీసుకుంది.
రెపో రేటు పెరగడంతో కార్పొరేట్లు, సామాన్యులు వడ్డీ భారాన్ని అధికంగా మోయవలసి ఉంటుంది. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు పెరగడం ఇది మూడోసారి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు కళ్లెం వేయడం కోసం ఈ రేటును కోవిడ్-19 మహమ్మారి రావడానికి ముందు ఉన్న స్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.