దేశ భవిష్యత్‌ని ధ్వంసం చేస్తున్నారు: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-07-17T22:10:43+05:30 IST

దేశంలోని నిరుద్యోగాన్ని పెంచుతూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొట్టడమే కాకుండా నియంతృత్వంతో దేశ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-2018 అభ్యర్థులు నిరసన చేస్తున్న వీడియోను..

దేశ భవిష్యత్‌ని ధ్వంసం చేస్తున్నారు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలోని నిరుద్యోగాన్ని పెంచుతూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొట్టడమే కాకుండా నియంతృత్వంతో దేశ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మోదీ ప్రభుత్వం(modi government)పై కాంగ్రెస్(congress) సీనియర్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) మండిపడ్డారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-2018(SSC GD Constable) అభ్యర్థులు నిరసన చేస్తున్న వీడియోను ఆదివారం తన ట్విట్టర్(twitter) ఖాతాలో రాహుల్ గాంధీ షేర్ చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘ప్రశ్నలు అడగవద్దు. నోరు మెదపవద్దు. శాంతిపూర్వకంగా నిరసన చేపట్టవద్దు. కొత్త ఇండియాలో హక్కుల కోసం డిమాండ్ చేస్తే అరెస్ట్‌లు చేయబడతాయి. యువతను నిరుద్యోగం వైపు మళ్లిస్తూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొడుతున్నారు. ఈ నియంతృత్వ ప్రభుత్వం(dictatorial government) దేశ భవిష్యత్‌ను ధ్వంసం చేస్తోంది’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-07-17T22:10:43+05:30 IST