Special trains: దసరాకు ఏడు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-10-01T17:11:42+05:30 IST

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టారు. ప్రయాణీకుల సౌకర్యార్థ నైరుతి రైల్వేజోన్‌

Special trains: దసరాకు ఏడు ప్రత్యేక రైళ్లు

బెంగళూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టారు. ప్రయాణీకుల సౌకర్యార్థ నైరుతి రైల్వేజోన్‌ పరిధిలో మొత్తం ఏడు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నారు. మైసూరు, తిరునల్వేలి, మురుడేశ్వర, తూత్తుకుడి(Mysore, Tirunelveli, Murudeswara, Thoothukudi) తదితర ప్రాంతాలకు బెంగళూరుసిటీ, యశ్వంతపురం, విశ్వేశ్వరయ్య టర్మినల్‌, మైసూరుల నుంచి ఈ ప్రత్యేక రైళ్ళ సంచారం ఉంటుందని రైల్వే అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్ళలో సీట్ల రిజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని ఈ అవకాశాన్ని ప్రయాణీకులు వినియోగించుకోవాలని వెల్లడించారు.

Updated Date - 2022-10-01T17:11:42+05:30 IST