దేశంలో Covid fourth wave scare...కొత్త ఒమైక్రాన్ సబ్ వేరియెంట్
ABN , First Publish Date - 2022-07-04T16:05:49+05:30 IST
దేశంలో కొవిడ్ -19 మహమ్మారి నాల్గవ వేవ్ ప్రబలుతోందని...
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ -19 మహమ్మారి నాల్గవ వేవ్ ప్రబలుతోందని ఇజ్రాయెలీ వైద్యనిపుణుడు టెల్ హాషోమర్లోని షెబా మెడికల్ సెంటర్లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీతో డాక్టర్ షే ఫ్లీషాన్ వెల్లడించారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త ఒమైక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ 2.75 ప్రబలుతోందని డాక్టర్ షే ఫ్లీషాన్ పేర్కొన్నారు. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియెంట్ ప్రబలుతోంది.దేశంలో ప్రబలుతున్న ఈ కొత్త సబ్-వేరియంట్ను భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.జపాన్, జర్మనీ, యూకే, కెనడా, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కూడా ఒమైక్రాన్ కొత్త సబ్ వేరియెంట్ ప్రబలిందని వైద్యనిపుణులు చెప్పారు.