Commissioner: అత్యవసరం అయితేనే బయటకు రావాలి
ABN , First Publish Date - 2022-12-10T09:13:10+05:30 IST
చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం(Mahabalipuram)లో మాండస్ తుఫాను తీరందాటనున్న నేపథ్యంలో నగర వాసు
- నగర వాసులకు కమిషనర్ వినతి
అడయార్(చెన్నై), డిసెంబరు 9: చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం(Mahabalipuram)లో మాండస్ తుఫాను తీరందాటనున్న నేపథ్యంలో నగర వాసులు అత్యవసర పనుల కోసమే ఇళ్ళనుంచి బయటకు రావాలని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జీవాల్(Chennai Police Commissioner Shankar Jeewal) విఙ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మాండస్ తుపాను కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నగర వాసులు కేవలం అత్యవసర పనులుంటేనే ఇళ్ళ నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో వాహనచోదకులు అనవసరంగా రోడ్లపై తిరగొద్దని, అవసరమైన పాలు, కూరగాయలు, కిరాణా సరుకులు వంటి తెచ్చుపెట్టుకోవాలని సూచించారు.