Karnatakaలో నేటినుంచి కళాశాలలు ప్రారంభం...9 జిల్లాల్లో 144 సెక్షన్

ABN , First Publish Date - 2022-02-16T15:02:46+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో బుధవారం నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి....

Karnatakaలో నేటినుంచి కళాశాలలు ప్రారంభం...9 జిల్లాల్లో 144 సెక్షన్

బెంగళూరు:  కర్ణాటక రాష్ట్రంలో బుధవారం నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని బాగల్ కోట్, బెంగళూరు, చిక్కబళ్లాపూర్, గదగ్, షిమోగ, తూమ్ కూర్, మైసూరు, ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను విధించారు. శివమొగ్గ నగరంలో హిజాబ్ వివాదం నేపథ్యంలో ఎస్ఎస్ఎల్‌సీ ప్రాథమిక పరీక్షలను ముస్లిం విద్యార్థినులు బహిష్కరించారు.మరో వైపు కర్ణాటక హైకోర్టు హిజాబ్ వివాదంపై దాఖలైన కేసును విచారించనుంది. కళాశాలల వద్ద ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-02-16T15:02:46+05:30 IST