Three districts: 23 నుంచి సీఎం పర్యటన

ABN , First Publish Date - 2022-08-20T13:24:00+05:30 IST

కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌ జిల్లాల్లో ఈ నెల 23వ తేదీ నుంచి మూడు రోజులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)

Three districts: 23 నుంచి సీఎం పర్యటన

ప్యారిస్‌(చెన్నై), ఆగస్టు 19: కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌ జిల్లాల్లో ఈ నెల 23వ తేదీ నుంచి మూడు రోజులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పర్యటించనున్నారు. ఈ మేరకు సచివాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవైలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరం నుంచి విమానం ద్వారా ఈ నెల 23వ తేదీ రాత్రి సీఎం స్టాలిన్‌ కోవైకు వెళతారు. ఆ రాత్రి కోవైలో బసచేస్తారు. మరుసటిరోజు ఉదయం వివిధ శాఖల తరఫున లబ్ధిదారులకు సంక్షేమ సహాయాలు అందజేస్తారు. ఆ రోజు పొల్లాచ్చిలో డీఎంకే(DMK) తరఫున నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. 25న జిల్లా కేంద్రం తిరుప్పూర్‌(Tiruppur) చిన్న, మధ్యతరహా పరిశ్రమల తరఫున నిర్వహించే సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. 26వ తేదీ ఈరోడ్‌ జిల్లాలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి పథకాల ప్రారంభం, లబ్ధిదారులకు సహాయాల పంపిణీ చేస్తారు. రాత్రికి చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - 2022-08-20T13:24:00+05:30 IST