Chief Minister: రూ.150 కోట్లతో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లు
ABN , First Publish Date - 2022-08-26T13:07:40+05:30 IST
అంబత్తూరు, గిండి పారిశ్రామికవాడల్లో రూ.150 కోట్లతో రెండంతస్తుల్లో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief
- సీఎం స్టాలిన్
అడయార్(చెన్నై), ఆగస్టు 25: అంబత్తూరు, గిండి పారిశ్రామికవాడల్లో రూ.150 కోట్లతో రెండంతస్తుల్లో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) తెలిపారు. తిరుపూరులో గురువారం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ఆధ్యర్యంలో జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిడ్కో ఆధ్వర్యంలో ఐదు జిల్లాల్లో 81.85 ఎకరాల విస్తీర్ణంలో కొత్త పారిశ్రామికవాడల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అంబత్తూరు, గిండిల్లో రూ.150 కోట్లతో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు స్థలాలను తక్కువ ధరకే కేటాయించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ప్లాట్ల ధరలను ఇప్పటిగే తగ్గించామని తెలిపారు. కోయంబత్తూరు(Coimbatore)లోని సెల్వంపాళెయంలో కొత్తగా ఒక పారిశ్రామికవాడను నిర్మిస్తామని, ఇది 42.42 ఎకరాల విస్తీరణంలో ఉంటుందని, దీనికి శంకుస్థాపన చేసినట్టు వెల్లడించారు.