మాతృభాషలోనే విద్యా బోధన

ABN , First Publish Date - 2022-08-02T08:57:35+05:30 IST

ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్ప ష్టం చేసింది.

మాతృభాషలోనే విద్యా బోధన

ప్రాథమిక విద్య ఆ భాషలోనే

లోక్‌సభలో కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్ప ష్టం చేసింది. విద్యా హక్కు చట్టం-2009లోని 5వ అధ్యాయంలో ఉన్న సెక్షన్‌ 29(ఎఫ్‌) ప్రకారం చిన్నారులకు మాతృభాషలో విద్యా బోధన సాగాలని కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవి అన్నారు. ఈ మేరకు లోక్‌సభలో పలువురు అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ విద్యా విధానం- 2020 ప్రకారం కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలని, 8వ తరగతి తర్వాత తరగతుల్లో కూడా మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Updated Date - 2022-08-02T08:57:35+05:30 IST