Chennai: నగరంలో 5జీ సేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-07T16:20:08+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో 5జీ సేవలు ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్‌(Airtel) ప్రకటించింది. దేశప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్న 5జీ సేవలను ఈ నె

Chennai: నగరంలో 5జీ సేవలు ప్రారంభం

పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 6: రాజధాని నగరం చెన్నైలో 5జీ సేవలు ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్‌(Airtel) ప్రకటించింది. దేశప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్న 5జీ సేవలను ఈ నెల 1న ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్‌ మహానాడులో ప్రధాని మోదీ ప్రారంభించారు. తొలివిడతగా చెన్నై, ఢిల్లీ, ముంబై(Chennai, Delhi, Mumbai) తదితర ప్రధాన నగరాల్లో 5జీ సేవలు పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో, ఎయిర్‌టెల్‌ సంస్థ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, చెన్నైలో 5జీ సేవలు ప్రారంభించినట్లు, దీని వేగం 4జీ కన్నా 30 రెట్లు అధికంగా ఉంటుందని తెలిపింది. 4జీ సిమ్‌కార్డ్‌ ద్వారానే 5జీ సేవలు కూడా పొందవచ్చని, ఈ సేవల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

Updated Date - 2022-10-07T16:20:08+05:30 IST