Chennai నగరంలో 500 ఎలక్ట్రిక్ బస్సులు
ABN , First Publish Date - 2022-05-24T15:06:42+05:30 IST
నగరంలో తొలివిడతగా 500 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి ఎస్ఎస్ శివశంకర్ తెలిపారు. కరూర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా స్పందన
ఐసిఎఫ్(చెన్నై): నగరంలో తొలివిడతగా 500 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి ఎస్ఎస్ శివశంకర్ తెలిపారు. కరూర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా స్పందన ఎలా ఉంటుందో గమనించి దానికి అనుగుణంగా మరిన్ని బస్సులు నడుపుతామని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో బస్ ఛార్జీలు పెరగవన్నారు. సిలిండర్కు ఇదివరకే కేంద్రప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీని సక్రమంగా ఇస్తే చాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని విమర్శించారు.