MGR Chennai Central Railway Stationలో రూ.37 లక్షలు స్వాధీనం
ABN , First Publish Date - 2022-08-29T16:47:19+05:30 IST
నిక ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్(MGR Chennai Central Railway Station)లో రూ.37 లక్షల హవాలా సొమ్మును రైల్వే పోలీసులు
చెన్నై/ఐసిఎఫ్: స్థానిక ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్(MGR Chennai Central Railway Station)లో రూ.37 లక్షల హవాలా సొమ్మును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం న్యూ జల్బైగురి నుంచి నగరానికి కొచ్చిన ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులను తనిఖీ చేసిన రైల్వే పోలీసులు, శంకర్ ఆనందరావు నుంచి రూ.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆనందరావు తగిన ఆధారాలు లేకుండా నగదు తరలిస్తుండడంతో హవాలా సొమ్ముగా భావిస్తున్న పోలీసులు, అతడిని విచారిస్తున్నారు.