Bomb Threat: ఇరాన్-చైనా విమానానికి బాంబు బెదిరింపు...భారత్లో ల్యాండింగ్కు నిరాకరణ
ABN , First Publish Date - 2022-10-03T18:16:15+05:30 IST
ఇరాన్-చైనా ప్యాసింజర్ విమానం(Iran China Passenger Plane) ఢిల్లీకి చేరుకునే సమయంలో బాంబు బెదిరింపు(Bomb Threat) రావడంతో భారత వైమానిక అధికారులు అప్రమత్తమయ్యారు....
న్యూఢిల్లీ: ఇరాన్-చైనా ప్యాసింజర్ విమానం(Iran China Passenger Plane) ఢిల్లీకి చేరుకునే సమయంలో బాంబు బెదిరింపు(Bomb Threat) రావడంతో భారత వైమానిక అధికారులు అప్రమత్తమయ్యారు. మహాన్ ఎయిర్ విమానానికి(Mahan Air flight) బాంబు బెదిరింపు వచ్చినప్పుడు భారత(India) గగనతలంలో ఉంది. అయినా సాంకేతిక కారణాల వల్ల భారతదేశంలో చైనా వెళ్లే విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతి నిరాకరించారు.(Landing Denied In India)ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ ప్రకారం చైనా వెళుతున్న ఐఆర్ఎం 081 విమానం ఇరాన్లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళుతోంది.
బాంబు బెదిరింపుతో ఆ విమానం ఢిల్లీ, జైపూర్లలో దిగేందుకు అనుమతించక పోవడంతో చైనాకు ప్రయాణాన్ని కొనసాగించింది. సోమవారం ఉదయం 9:20 గంటలకు ఈ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు వెంటనే అప్రమత్తమై ల్యాండింగ్కు అనుమతి కోరారు. కానీ సాంకేతిక కారణాల వల్ల అనుమతి లభించక పోవడంతో జైపూర్కు మళ్లించారు.ఈ విమానం జైపూర్ లోనూ దిగేందుకు వీలు కాలేదు.దీంతో ఆ తర్వాత విమానం చైనాకు వెళ్లింది.