Bhimla Kapoor: భారత్లో ప్రపంచస్థాయి నర్సింగ్ విద్య అవసరం
ABN , First Publish Date - 2022-08-25T15:43:06+05:30 IST
భారత్లో ప్రపంచస్థాయి నర్సింగ్ విద్య అవసరమని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ భీమ్లా
చెన్నై, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): భారత్లో ప్రపంచస్థాయి నర్సింగ్ విద్య అవసరమని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ భీమ్లా కపూర్(Bhimla Kapoor) పేర్కొన్నారు. బుధవారం జరిగిన శ్రీ రామచంద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్. తనికాచలం స్మారకోపన్యాసం కార్యక్రమంలో భీమ్లా కపూర్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు నర్సింగ్(Nursing) ప్రమాణాలు మరింత మెరుగు పడాల్సి వుందన్నారు. కొవిడ్(covid) మహమ్మారి సమయంలో బాగా పని చేసిన నర్సులు ప్రపంచ ప్రశంసలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపలకుపతి పీవీ విజయరాఘవన్, నర్సింగ్ విద్యా విభాగాధిపతి డాక్టర్ ఎస్జే నళిని, ఉపకులపతి డాక్టర్ ఎస్.శాంతి, ప్రత్యేక విభాగాధిపతి డాక్టర్ అనితా డేవిడ్ తదితరులు కూడా పాల్గొన్నారు.