భారత్‌, పాక్‌ ప్రయాణంలో జాగ్రత్త

ABN , First Publish Date - 2022-10-08T09:38:48+05:30 IST

నేరాలు, ఉగ్రవాద ఘటనల కారణంగా భారత్‌, పాకిస్థాన్‌ పర్యటలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అమెరికా తన పౌరులను కోరింది.

భారత్‌, పాక్‌ ప్రయాణంలో జాగ్రత్త

తన పౌరులకు అమెరికా సూచన 

వాషింగ్టన్‌, అక్టోబరు 7: నేరాలు, ఉగ్రవాద ఘటనల కారణంగా భారత్‌, పాకిస్థాన్‌ పర్యటలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అమెరికా తన పౌరులను కోరింది. భారత్‌లో జమ్మూకశ్మీర్‌, పాక్‌లో మాజీ ఫెడరల్లీ అడ్మినిస్ర్టెడ్‌ ట్రైబల్‌ ఏరియాస్‌ (ఎఫ్‌ఏటీఏ)సహా బలూచిస్థాన్‌, ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావిన్సులకు వెళ్లవద్దని తన పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ గురువారం సూచించింది. ఈ మేరకు శుక్రవారం విదేశాంగ శాఖ కొత్త ట్రావెల్‌ అడ్వైజరీని జారీ చేసింది. భారత్‌లో అత ్యంత వేగంగా పెరుగుతున్న నేరాల్లో అత్యాచారం ఒకటని పేర్కొంది. ఉగ్రవాద గ్రూపులు పాకిస్థాన్‌లో దాడులకు కుట్ర పన్నుతున్నాయని, సైద్ధాంతిక ఆకాంక్షలతో పౌరులతో పాటు స్థానిక సైనికులు, పోలీసులపై విచక్షణారహిత దాడులకు దారితీసినట్టు పేర్కొంది. 

Updated Date - 2022-10-08T09:38:48+05:30 IST