Pak Drone: సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కాల్పులు... మరో పాక్ డ్రోన్ కూల్చివేత
ABN , First Publish Date - 2022-11-29T09:46:00+05:30 IST
పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం ఉక్కుపాదం మోపింది.
అమృత్సర్(పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలోని పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం ఉక్కుపాదం మోపింది. అమృత్సర్లోని(Amritsar) భారత భూభాగంలోకి చొరబడడాన్ని గమనించిన బీఎస్ఎఫ్(BSF) సైనికులు పాకిస్థాన్ డ్రోన్ను కూల్చివేశారు.(Pak Drone) పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న ఒక డ్రోన్తో పాటు అనుమానాస్పద వస్తువును కూడా సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.డ్రోన్ పంజాబ్ రాష్ట్రంలోని (Punjab) చహర్పూర్ గ్రామ సమీపంలోని భారత భూభాగంలోకి చొరబడడాన్ని గమనించిన తర్వాత భారత సైనికులు దానిపై కాల్పులు జరిపారు.దీంతో పాక్ మరో స్మగ్లింగ్ ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు సైనిక అధికారులు తెలిపారు.
బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో పాక్ డ్రోన్ నేలకూలింది.(Shot Down) చహర్పూర్ గ్రామ సమీపంలో సరిహద్దు ఫెన్సింగ్ వద్ద ఉన్న వ్యవసాయ పొలంలో పడి ఉన్న తెల్లటి రంగు పాలిథిన్లో అనుమానిత వస్తువును బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.పంజాబ్లోని పఠాన్కోట్లోని సరిహద్దు సమీపంలో ఇద్దరు చొరబాటుదారులను గుర్తించిన తర్వాత బీఎస్ఎఫ్ వారి చొరబాటు యత్నాన్ని విఫలం చేసింది.
పాకిస్థాన్ చొరబాటుదారుల కదలికలు
సరిహద్దుల్లో అమర్చిన థర్మల్ కెమెరాలో పాకిస్థాన్ చొరబాటుదారుల కదలికలు రికార్డయ్యాయి.2021తో పోలిస్తే భారత భూభాగంలోకి పాకిస్థానీ డ్రోన్ల చొరబాటు పెరిగింది. సరిహద్దు వెంబడి ఈ ఏడాది దాదాపు 230 డ్రోన్లు కనిపించాయి.ఈ డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆయుధాలు, డ్రగ్స్ పంపుతుందని బీఎస్ఎఫ్ జవాన్లు చెప్పారు.