Enforcement Directorate : దేశ వ్యతిరేక చర్యల కోసం అమ్నెస్టీ ఇండియాకు రూ.51 కోట్లు

ABN , First Publish Date - 2022-07-24T16:23:25+05:30 IST

సేవల ఎగుమతి ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ

Enforcement Directorate : దేశ వ్యతిరేక చర్యల కోసం అమ్నెస్టీ ఇండియాకు రూ.51 కోట్లు

న్యూఢిల్లీ : సేవల ఎగుమతి ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ కోసం అమ్నెస్టీ ఇండియా సంస్థకు నిధులను అమ్నెస్టీ వరల్డ్‌వైడ్ యూకే అందజేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ఈడీ) ఆరోపించింది. ‘కశ్మీర్: ఎంట్రీ టు జస్టిస్’, ‘జస్టిస్ ఫర్ 1984 సిక్ బ్లడ్‌బాత్’ వంటి కార్యక్రమాల కోసం చట్టాలను ఉల్లంఘించి దాదాపు రూ.51 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. 


ఈడీ జూలై 9న ప్రాసిక్యూషన్ గ్రీవియెన్స్ (ఛార్జిషీటుతో సమానం)ను ఢిల్లీలోని కోర్టుకు సమర్పించింది. అమ్నెస్టీ వరల్డ్‌వైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (AIIPL), ఇండియన్స్ ఫర్ అమ్నెస్టీ వరల్డ్‌వైడ్ బిలీఫ్ (IAIT), AIIPL మాజీ సీఈఓలు జీ అనంత పద్మనాభన్, ఆకార్ పటేల్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించింది. అమ్నెస్టీ వరల్డ్ వైడ్ భారత దేశంలో కార్యకలాపాలను విస్తరించడం కోసం అమ్నెస్టీ వరల్డ్‌వైడ్ ఇండియా బేసిస్ బిలీఫ్‌ను 1999లో ఏర్పాటు చేసిందని తెలిపింది. 2011-12లో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) అమల్లోకి రావడంతో విదేశీ విరాళాలను స్వీకరించేందుకు ఈ ఎన్‌జీవోకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. ఆ తర్వాత దీనిని ఉపసంహరించారని తెలిపింది. అమ్నెస్టీ వరల్డ్‌వైడ్ ఐఏఐటీని 2012లో ఏర్పాటు చేసిందని, ఇది లాభాపేక్ష లేని సంస్థ అని తెలిపింది. 2013లో ఏఐఐపీఎల్‌ను ఏర్పాటు చేసిందని, ఇది లాభాల కోసం పని చేసే వ్యాపార సంస్థ అని తెలిపింది. 


ఐఏఐటీ దేశీయంగా వచ్చే నిధులతో పని చేస్తుందని మొదట ప్రకటించారని, ఆ నిధులతో భారత దేశంలో మానవ హక్కులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తుందని తెలిపారని ఈడీ పేర్కొంది. ఏఐఐపీఎల్ కూడా ఇదేవిధమైన కార్యకలాపాలను నిర్వహిస్తుందని, అయితే సేవల ఎగుమతి తరహాలో అనుభవం, ప్రచార కార్యక్రమాల నిర్వహణ వంటివాటి కోసం కొంత సొమ్మును వసూలు చేస్తుందని పేర్కొన్నారని తెలిపింది. ఈ రెండు సంస్థలకు ఒకే వర్క్‌ప్లేస్ బేరర్స్ అమ్నెస్టీ వరల్డ్‌వైడ్ యూకే ఉన్నట్లు తెలిపింది. 


ఈ రెండు సంస్థలను ఏర్పాటు చేసిన తర్వాత ఏఐఐపీఎల్‌లో 99,8 శాతం వాటాలను ఐఏఐటీ కొనుగోలు చేసిందని తెలిపింది. మిగిలిన వాటాలను ఐఏఐటీ ట్రస్టీలు తమ వద్ద ఉంచుకున్నారని పేర్కొంది. అమ్నెస్టీ వరల్డ్‌వైడ్ యూకే 2015లో రూ.10 కోట్లను ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) రూపంలో ఏఐఐపీఎల్‌లో పెట్టిందని తెలిపింది. దీనిలో రూ.9 కోట్లను ఏఐఐపీఎల్ డిపాజిట్‌ చేసిందని పేర్కొంది. ఈ ఎఫ్‌డీతో ఐఏఐటీ ఓ ఆర్థిక సంస్థ నుంచి సుమారు రూ.14 కోట్లు ఓవర్‌డ్రాఫ్ట్ పొందినట్లు తెలిపింది. ఏఐఐపీఎల్ రూ.10 కోట్ల ఎఫ్‌డీఐతో సహా రూ.36 కోట్లు సేకరించిందని పేర్కొంది. మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటివాటి కోసం ఈ నిధులను సేకరించిందని తెలిపింది. ఏఐఐపీఎల్, ఐఏఐటీ స్వీకరించిన సొమ్ము నేర ప్రతిఫలమని ఆరోపించింది. 


ఏఐఐపీఎల్‌కు అమ్నెస్టీ వరల్డ్‌వైడ్ నుంచి వచ్చిన కాంట్రాక్టుల్లో కొన్ని ఏమిటంటే, టెక్నికల్ కంపెనీలు, కశ్మీరు సంబంధిత సమస్యలు, 1984 సిక్కుల ఊచకోత, బొగ్గు రంగంలో కంపెనీల జవాబుదారీతనం, మహిళా సమస్యలు, వలసదారుల హక్కులు, మానవ హక్కులపై అవగాహన కల్పించడం, విచారణ ఖైదీల సమస్యలు వంటివి.


జస్టిస్ ఫర్ ది 1984 సిక్ బ్లడ్‌బాత్, ఎంట్రీ టు జస్టిస్ ఇన్ జమ్మూ-కశ్మీర్ ప్రాజెక్టుల కోసం నిధుల స్వీకరణలో అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆరోపించింది. మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టడం, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలను మొబిలైజ్ చేయడం, మీడియా, టీవీ, రేడియో, తదితర ప్రసార మాద్యమాల ద్వారా రాజకీయ కార్యక్రమాలపై ఒత్తిడి తేవడం వంటి కార్యకలాపాలను ఏఐఐపీఎల్ నిర్వహించినట్లు పేర్కొంది. 


ఆకార్ పటేల్ (AAkar Patel) మీడియాతో మాట్లాడుతూ, తాము తప్పు చేసినట్లు రుజువు చేయవలసినది ప్రభుత్వమేనని చెప్పారు. దేశ వ్యతిరేకం (Anti National) అంటే ఏమిటో తనకు తెలియడం లేదన్నారు. తాము చేస్తున్న పనులను చేయకుండా ఆపే నిబంధన ఏదైనా ఉన్నట్లు తనకు తెలియదని చెప్పారు. 


Updated Date - 2022-07-24T16:23:25+05:30 IST