వీఆర్ఏల డిమాండ్లు పరిష్కరించండి
ABN , First Publish Date - 2022-09-11T08:58:39+05:30 IST
వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ శనివారం లేఖ రాశారు.
సీఎం కేసీఆర్కు సీఐటీయూ లేఖ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ శనివారం లేఖ రాశారు. వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 20 మందిపైగా వీఆర్ఏలు మరణించారని, వెంటనే వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.