Toxic Gas Leak: కెమికల్ యూనిట్లో విషవాయువు లీకేజీ...ఒకరు మృతి
ABN , First Publish Date - 2022-09-04T21:16:06+05:30 IST
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తారాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం..
పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తారాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రగ్స్, ఫార్మూస్యూటికల్స్ తయారీ కంపెనీ ప్లాంట్లో విషవాయువు లీక్ కావడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, గ్యాస్ లీకేజీతో అక్కడ పనిచేస్తున్న కార్మికులకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని జిల్లా డిజాస్టర్ మేనేజిమెంట్ సెల్ చీఫ్ వివేకానంద కదమ్ తెలిపారు. మృతిచెందిన కార్మికుని భగవత్ చౌపాల్ (22)గా గుర్తించారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ సహా ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్ డైరెక్టరేట్ అధికారులు హుటాహుటిన ప్లాంట్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.