Cameroon: అంత్యక్రియల్లో విషాదం...కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
ABN , First Publish Date - 2022-11-28T06:26:47+05:30 IST
కామెరూన్లో ఘోర ప్రమాదం జరిగింది.అంత్యక్రియల్లో విషాద ఘటన ..
యౌండే (కామెరూన్): కామెరూన్లో ఘోర ప్రమాదం జరిగింది.అంత్యక్రియల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కామెరూన్ రాజధాని యౌండే నగరంలో ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో అంత్యక్రియలకు హాజరైన 14 మంది మరణించారని కామెరూన్ (Cameroon) ప్రాంత గవర్నర్ తెలిపారు.ప్రజలు అంత్యక్రియలకు(Funeral) హాజరు కాగా 20 మీటర్ల మట్టి కట్ట ఆకస్మాత్తుగా కూలిపోయిందని(Landslide) ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
భారీవర్షాల కారణంగా కొండల్లో నిటారుగా నిర్మించిన గుడిసెలు కూలిపోవడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.తాము ఇప్పటికే 14 మృతదేహాలను వెలికితీసి వాటిని మార్చూరీకి తీసుకువెళుతున్నామని, ఇంకా మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతుందని కామెరూన్ సెంటర్ రీజియన్ గవర్నర్ నసేరి పాల్ బీ సంఘటనా స్థలంలో మీడియాకు చెప్పారు.