కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఈసీ ఆదేశం
ABN , First Publish Date - 2022-02-20T01:11:51+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదు చేయాలని పంజాబ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు..
మొహాలి: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదు చేయాలని పంజాబ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శిరోమణి అకాలీదళ్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో సాస్ నగర్ సీనియర్ ఎస్పీకి చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఈ ఆదేశాలిచ్చారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఇతర పార్టీలపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఈసీ ఈ ఆదేశాలిచ్చింది. ప్రజలకు తప్పుడు సందేశాలు వెళ్లేవిధంగా శిరోమణి అకాలీదళ్, ఇతర పార్టీల ఇమేజ్ను దెబ్బతీస్తూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి అకాలీదళ్ తీసుకువెళ్లింది. తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.