గురుకుల పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-02-16T21:10:45+05:30 IST
గురుకుల పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి అజ్మీ ర సంతోష్నాయక్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ..
మంచిర్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 15: గురుకుల పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి అజ్మీ ర సంతోష్నాయక్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో చేపడుతున్న విద్యా చైతన్య యాత్ర మంగళ వారం జిల్లాలో ముగిసింది. ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం సున్నంబట్టివాడలోని రూప ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో సమస్య లు రాజ్యమేలుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమస్యలను పరిష్కరించారని తెలిపారు. ప్రస్తుతం గురుకులాల్లో తల్లిదండ్రులకు ప్రవేశం లేకుండా చేసే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, ప్రధాన కార్యదర్శి రవి, అధికార ప్రతినిధి నర్సయ్య, మహిళల వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు నాగమణి, లలితరాణి, పాల్గొన్నారు.