Festivals: శారదా విద్యాలయ శతాబ్ది వేడుకలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-29T16:31:02+05:30 IST

కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్న శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు నేడు ప్రారంభమమ్యాయి

Festivals: శారదా విద్యాలయ శతాబ్ది వేడుకలు ప్రారంభం
శతాబ్ది వేడుకలు ప్రారంభం

హైదరాబాద్‌, 29 నవంబర్‌ 2022: కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్న శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు నేడు ప్రారంభమమ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణా రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వి.కరుణ, సైబరాబాద్‌ పొలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఐపీఎస్‌ వర్ట్యుసా హైదరాబాద్‌ ఫెసిలిటీ హెడ్‌ శ్రీ కృష్ణ ఎదుల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ శ్రీ జయంత్‌ ఠాగోర్‌, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్‌ మాదిరెడ్డి, కరస్పాండెంట్‌ జ్యోత్స్న అంగారా సైతం పాల్గొన్నారు.

2.gif

నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో శారదా విద్యాలయ గ్రూప్‌ను 1922లో వై సత్యనారాయణ ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయను అప్పటి హైదరాబాద్‌ నిజాం ప్రధానమంత్రితో పాటుగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అత్యంత పురాతనమైన, లాభాపేక్షలేని విద్యాలయంగా ఖ్యాతి గడించిన శారదా విద్యాలయలో కేజీ నుంచి పీజీ వరకూ విద్యాబోధన సాగుతుంది. దాదాపు 1450 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత బాలికల కోసమే దీనిని ప్రారంభించినా అనంతర కాలంలో బాలురకు ఇక్కడ విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలో 62% మంది బాలికలు ఉన్నారు. నిరుపేద చిన్నారులకు విద్యనందించడంలో అందిస్తున్న తోడ్పాటుకుగానూ 2018లో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డునూ అందుకుంది.

3.gif

అవిశ్రాంతంగా వందేళ్లగా మెరుగైన విద్యాబోధనను పాతబస్తీ విద్యార్థులకు చేస్తోన్న శారదా విద్యాలయ విప్లవాత్మక ఆవిష్కరణలనూ మెరుగైన విద్య కోసం చేసింది. డిజిటల్‌ తరగతులను నాల్గవ తరగతి లోపు విద్యార్ధులకు తీసుకురావడంతో పాటుగా 1.36 ఎకరాల విస్తీర్ణంలో ఆటస్థలాన్నీ విద్యార్ధులకు అందుబాటులో ఉంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కూ అమిత ప్రాధాన్యత అందిస్తుంది.

4.gif

తమ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా చేయడానికి శారదా విద్యాలయ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా వందేళ్ల విద్యాలయ ప్రస్థానంలో కీలకమైలురాళ్లతో ఓ ఫోటో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఈ గ్యాలరీని ముఖ్యఅతిథి వి.కరుణ ప్రారంభించారు. దీనితో పాటుగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌నూ ఆమె సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలను విద్యార్థులు ప్రదర్శించారు.

5.gif

Updated Date - 2022-11-29T16:31:03+05:30 IST