గిరిజన విద్యార్థి పట్ల అనుచిత ప్రవర్తన.. టీచర్ సస్పెన్షన్

ABN , First Publish Date - 2022-09-26T20:33:09+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఓ గిరిజన విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. షాదోల్‌ జిల్లాలో బారాకల గ్రామంలోని ప్రభుత్వ గిరిజన

గిరిజన విద్యార్థి పట్ల అనుచిత ప్రవర్తన.. టీచర్ సస్పెన్షన్

భోపాల్‌, సెప్టెంబరు 25: మధ్యప్రదేశ్‌లోని ఓ గిరిజన విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. షాదోల్‌ జిల్లాలో బారాకల గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి అపరిశుభ్రంగా ఉన్న యూనిఫాంతో బడికి వెళ్లింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయుడు(teacher) శ్రావణ్‌ కుమార్‌ త్రిపాఠి యూనిఫాం(Uniform)ని తరగతిలోనే విప్పించారు. లోదుస్తులతో ఉన్న ఆ విద్యార్థితోనే యూనిఫాంని ఉతికించారు. దీనిని ఉపాధ్యాయుడు వీడియో తీసి.. తనను తాను స్వచ్ఛమిత్రగా పేర్కొంటూ పోస్ట్‌ చేశారు. వీడియోను చూసిన గిరిజన సంక్షేమశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆనంద్‌ రాయ్‌ సిన్హా(Tribal Welfare Assistant Commissioner Anand Roy Sinha) ఆ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తప్పించి దర్యాప్తుకు ఆదేశించారు. 

Updated Date - 2022-09-26T20:33:09+05:30 IST