వచ్చే ఏడాది నుంచే పాఠ్యప్రణాళిక మార్పు
ABN , First Publish Date - 2022-02-19T17:24:58+05:30 IST
పోటీ ప్రపంచంలోని అవసరాలకు తగ్గట్టుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యప్రణాళికలో మార్పులకు తమ వర్సిటీ శ్రీకారం చుడుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డి.రవీందర్ చెప్పారు. మల్టీ డిసిప్లినరీ కోర్సులను అందుబాటులోకి..
డిగ్రీ కాలేజీల సదస్సులో ఓయూ వీసీ డి.రవీందర్
ఉప్పల్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పోటీ ప్రపంచంలోని అవసరాలకు తగ్గట్టుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యప్రణాళికలో మార్పులకు తమ వర్సిటీ శ్రీకారం చుడుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డి.రవీందర్ చెప్పారు. మల్టీ డిసిప్లినరీ కోర్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. డిగ్రీలో చదివిన సబ్జెక్టుతో సంబంధంలేని ఇతర సబ్జెక్టుల్లోనూ పీజీ చేసే అవకాశాన్ని విద్యార్థులకు ఇస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు పొందిన డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్తో శుక్రవారం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో రవీందర్ ప్రసంగించారు. ఓయూలో సివిల్స్ అకాడమీ ప్రారంభిస్తామని, సరికొత్త పాఠ్యప్రణాళిక, మూల్యాంకనం వంటి ప్రణాళికలను వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు.