Shocking Crime: భర్తను హత్య చేసి కొడుకును తీసుకుని పారిపోయిన మహిళ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-11-28T14:17:59+05:30 IST

బీహార్‌లోని (Bihar) పాట్నాకు చెందిన ఓ మహిళ దారుణ నేరానికి ఒడిగట్టింది. తన భర్తను హత్య చేసి (Wife Killed Husband) ఆరు నెలల చిన్నారిని తీసుకుని పారిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

Shocking Crime: భర్తను హత్య చేసి కొడుకును తీసుకుని పారిపోయిన మహిళ.. అసలేం జరిగిందంటే..

బీహార్‌లోని (Bihar) పాట్నాకు చెందిన ఓ మహిళ దారుణ నేరానికి ఒడిగట్టింది. తన భర్తను హత్య చేసి (Wife Killed Husband) ఆరు నెలల చిన్నారిని తీసుకుని పారిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్‌మ్‌కు తరలించి నిందితురాలి గురించి అన్వేషణ ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

గౌరీచక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పప్పుకుమార్‌ అనే వ్యక్తికి గతేడాది పాట్నాకు చెందిన అమ్మాయితో వివాహమైంది. పాట్నాలోనే ఉండాలనుకున్న వధువు పల్లెటూళ్లో అత్తింట్లో ఉండేందుకు ఇష్టపడలేదు. పాట్నా వెళ్లేందుకు వరుడు అంగీకరించలేదు. దీంతో పెళ్లి జరిగిన మొదటి రోజే వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. తల్లిదండ్రులు ఆమెకు నచ్చచెప్పి బలవంతంగా పల్లెటూరిలోని అత్తింటికి పంపించారు. అప్పట్నుంచి ఆమె భర్తతో గొడవపడడం ప్రారంభించింది. పాట్నాకు మకాం మార్చేద్దామని గొడవపెట్టుకునేది.

తన ఊరు వదలి పాట్నా వెళ్లేందుకు పప్పు అంగీకరించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఆదివారం రాత్రి గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న పప్పుకుమార్‌ మొహాన్ని దిండుతో నొక్కేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం తన బిడ్డతో కలిసి పారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్‌మ్‌కు తరలించి నిందితురాలి గురించి అన్వేషణ ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

Updated Date - 2022-11-28T14:18:01+05:30 IST