marriage చేసుకుంటానని ప్రలోభ పెట్టి రెండు నెలలుగా బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2022-07-14T14:35:24+05:30 IST

ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రలోభ పెట్టిన యువకుడు ఆమెపై రెండు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన...

marriage చేసుకుంటానని ప్రలోభ పెట్టి రెండు నెలలుగా బాలికపై అత్యాచారం

గురుగ్రామ్ : ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రలోభ పెట్టిన యువకుడు ఆమెపై రెండు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన గురుగ్రామ్ నగరంలో గురువారం వెలుగుచూసింది. నిందితుడు 4 రోజుల క్రితం బాలికను అపహరించాడు. కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయిన బాలికను ఢిల్లీ-జైపూర్ హైవేలోని బిలాస్‌పూర్ చౌక్ సమీపంలో అర్థరాత్రి కనుగొన్నారు. బాలిక తన కుటుంబ సభ్యులకు అత్యాచారం ఘటన గురించి వివరించింది. దీంతో బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బిలాస్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.ఫిర్యాదు ప్రకారం నిందితుడు బిలాస్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక గ్రామంలో బాలిక ఉన్న అదే పరిసరాల్లో నివసిస్తున్నాడు. 8వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు నెలల పాటు పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.


‘‘జులై 8న నిందితుడు నా కూతురిని అపహరించాడు. అర్థరాత్రి ఆమెను గుర్తించి ఇంటికి తీసుకొచ్చాం. మంగళవారం నిందితుడు అత్యాచారం చేశాడని, కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించాడని నా కూతురు మాతో చెప్పింది’’ అని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.దీంతో నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్‌లు 363 , 366A,506, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నామని బిలాస్‌పూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ తెలిపారు.


Updated Date - 2022-07-14T14:35:24+05:30 IST