wife: మధ్యప్రదేశ్‌లో మరో దారుణం

ABN , First Publish Date - 2022-11-21T10:28:26+05:30 IST

ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ దారుణ హత్యా ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘటన జరిగింది...

wife: మధ్యప్రదేశ్‌లో మరో దారుణం
MP Man

అనుమానంతో భార్యను రెండు ముక్కలు చేసి...అడవిలో పాతిపెట్టాడు

భోపాల్ (మధ్యప్రదేశ్): ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ దారుణ హత్యా ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన షాడోల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను రెండు ముక్కలు చేసి, ఆ భాగాలను అడవిలో వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టిన ఉదంతం సంచలనం రేపింది.(MP Man Cuts Wife)మృతురాలు సరస్వతి పటేల్‌గా, ఆమె భర్త రామ్‌కిషోర్‌ పటేల్‌గా పోలీసులు గుర్తించారు. అనుమానంతో(Suspecting) భార్యను(Wife) గొడ్డలితో నరికి చంపి, రెండు ముక్కలు చేసి వాటిని అడవిలో(Forest)వేర్వేరు ప్రాంతాల్లో పాతిపెట్టాడని పోలీసులు చెప్పారు.

ఫిర్యాదుతో వెలుగుచూసిన హత్య ఉదంతం

నవంబర్ 13వతేదీన ఓ వ్యక్తి తన సోదరుడు,అతని భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత నవంబర్ 15వతేదీన గ్రామానికి సమీపంలోని అడవిలో ఓ మహిళ దుస్తులు కనిపించాయని పోలీసులకు సమాచారం అందింది.పోలీసుల విచారణలో అడవిలో దొరికిన దుస్తులు తప్పిపోయిన మహిళకు చెందినవని పోలీసులు గుర్తించారు.

అడవిలో మొండెం...

అడవిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా ఓ చోట పాతిపెట్టిన తల కనిపించింది. ఆ ప్రదేశానికి కొంచెం దూరంలో ఒక మొండెం కూడా కనిపించింది. తప్పిపోయిన సరస్వతి అనే మహిళ శరీర భాగాలుగా పోలీసులు గుర్తించారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్‌లోని కరేలీ ప్రాంతంలో హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు.

నేరాన్ని అంగీకరించిన నిందితుడు

‘‘నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తమ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో... తన భార్య తీరుపై అనుమానం వచ్చి ఆమెను అడవికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి పూడ్చిపెట్టినట్లు నిందితుడు చెప్పాడు’’ అని ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత తల, మొండెం వేరువేరుగా పాతిపెట్టాడు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుమార్ ప్రతీక్ చెప్పారు.

Updated Date - 2022-11-21T10:51:23+05:30 IST