వీడసలు కొడుకేనా..? కన్న తల్లిని గొడ్డలితో నరికి చంపేశాడు..!

ABN , First Publish Date - 2022-12-05T15:59:49+05:30 IST

ఓ కొడుకు కన్న తల్లినే దారుణంగా హత్య చేశాడు. భూ వివాదంలో తల్లితో గొడవపడి ఆమెను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో ఆ తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.. దారుణానికి పాల్పడిన కొడుకు వెంటనే పరారయ్యాడు.. సమాచరం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు..

వీడసలు కొడుకేనా..? కన్న తల్లిని గొడ్డలితో నరికి చంపేశాడు..!

ఓ కొడుకు కన్న తల్లినే దారుణంగా హత్య చేశాడు. భూ వివాదంలో తల్లితో గొడవపడి ఆమెను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో ఆ తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.. దారుణానికి పాల్పడిన కొడుకు వెంటనే పరారయ్యాడు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది.

జైపూర్‌కు సమీపంలోని ద్వారిక్‌పురాకు చెందిన ముఖేష్ యాదవ్ అనే వ్యక్తి తన తల్లి షీలా దేవిని గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. తల్లి మెడ, తల, చేయి సహా శరీరంలోని అనేక భాగాలపై గొడ్డలితో ముఖేష్ దాడి చేశాడు. గాయపడిన వృద్ధురాలు షీలాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచరం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కొద్ది రోజుల క్రితం విక్రయించిన భూమికి సంబంధించిన డబ్బు పంచాలని చాలా కాలంగా తల్లిపై ముఖేష్‌ ఒత్తిడి తెస్తున్నాడు. తల్లి అందుకు అంగీకరించకపోవడంతో ముఖేశ్ తన ముసలి తల్లిని గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హతమార్చి పారిపోయాడు. తన మొబైల్‌ను ఘటనా స్థలంలోనే వదిలేసి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-12-05T15:59:50+05:30 IST