ఇద్దరిని బలిగొన్న మితిమీరిన వేగం

ABN , First Publish Date - 2022-12-02T11:13:35+05:30 IST

స్థానిక తరమణిలో మితిమీరిన వేగంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న యువకులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు.. తరమణి తందై పెరియార్‌

ఇద్దరిని బలిగొన్న మితిమీరిన వేగం

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 1: స్థానిక తరమణిలో మితిమీరిన వేగంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న యువకులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు.. తరమణి తందై పెరియార్‌ నగర్‌, కరుణానిధి వీధికి చెందిన ప్రవీణ్‌ (19) ప్రైవేటు కళాశాలలో బి.కాం రెండోసంవత్సరం చదువుతున్నాడు. అతను అదే ప్రాంతానికి చెందిన ప్లస్‌ టూ విద్యార్థి హరి (17)తో కలసి బుధవారం బైక్‌పై వెళ్లారు. ప్రవీణ్‌ నడుపుతున్న బైక్‌ తరమణి వందడుగుల రోడ్డుకు రాగానే బైక్‌ను 114 కి.మీ వేగంతో వెళుతుండగా, వెనుక కూర్చున్న హరి, బైక్‌ వేగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో తరమణి జంక్షన్‌ సమీపంలోని ఎస్‌ఆర్పీ టూల్స్‌ ప్రాంతంలో సరుకు వాహనం రివర్స్‌ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన బైక్‌ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌ నుంచి దూరంగా పడిన హరి, ప్రవీణ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు వారిని రాయపేట(Rayapeta) ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స ఫలించక మృతిచెందారు. బైక్‌ నడిపిన ప్రవీణ్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని గుర్తించిన గిండి ట్రాఫిక్‌ పోలీసులు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రవీణ్‌, హరిలు బైక్‌పై వేగంగా వెళుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - 2022-12-02T11:13:36+05:30 IST