Odisha: కోర్టు గదిలో జడ్జీపై దాడి

ABN , First Publish Date - 2022-11-29T06:13:03+05:30 IST

కోర్టు గదిలో ఓ కేసు విచారణ జరుగుతుండగా...ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి సాక్షాత్తూ జడ్జీపైనే కత్తితో దాడి చేసిన ....

Odisha: కోర్టు గదిలో జడ్జీపై దాడి
Odisha Man Attacks Judge

బ్రహ్మపూర్ : కోర్టు గదిలో ఓ కేసు విచారణ జరుగుతుండగా...ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి సాక్షాత్తూ జడ్జీపైనే కత్తితో దాడి చేసిన దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని బ్రహ్మపూర్ సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది.(Odisha Man) నిందితుడిని బ్రహ్మపూర్‌లోని(Brahmapur) బడా బజార్ ప్రాంతానికి చెందిన భగబన్ సాహూ (50)గా గుర్తించామని, కోర్టులో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేస్తామని బ్రహ్మపూర్ పోలీస్ సూపరింటెండెంట్ శరవణ వివేక్ ఎం తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

సోమవారం మధ్యాహ్నం కోర్టులో(Courtroom) న్యాయమూర్తి(Judge) ఒక కేసును విచారిస్తున్నప్పుడు సాహూ కత్తితో జడ్జీపై దాడి(Attacks) చేశాడని కోర్టు లోపల ఉన్న న్యాయవాది మృత్యుంజయ్ మహారాణా చెప్పారు.కోర్టు హాలులో ఉన్న కొందరు లాయర్లు సాహూ దాడి ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు.కోర్టు హాలులో ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అయితే న్యాయమూర్తిపై అతడు దాడి చేయడం వెనుక ఉద్ధేశం ఇంకా తెలియరాలేదు.

Updated Date - 2022-11-29T06:13:05+05:30 IST