Minister: మంత్రిపై క్రిమినల్‌ కేసు

ABN , First Publish Date - 2022-11-25T11:40:45+05:30 IST

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్‌ సుధాకర్‌(Minister Dr. Sudhakar)పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం

Minister: మంత్రిపై క్రిమినల్‌ కేసు

- సమన్లు జారీ చేసిన ప్రత్యేక కోర్టు

బెంగళూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్‌ సుధాకర్‌(Minister Dr. Sudhakar)పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. గురువారం ప్రత్యేక కో ర్టులో విచారణల వేళ న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాశ్వత నీటి పోరాట సమి తి అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ విచారణల వేళ మంత్రి సుధాకర్‌పై క్రిమినల్‌ కేసుకు ఆదేశించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో డాక్టర్‌ సుధాకర్‌ కాలుష్యనియంత్రణ మండలి అధ్యక్షుడిగా పని చేసిన విషయం తెలిసిందే. సుధాకర్‌ను ఏ అర్హతతో అధ్యక్షులు చేశారంటూ ఆంజనేయరెడ్డి కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. అందుకు తీవ్రంగా స్పందించిన సుధాకర్‌ రైతులకు నాటుసారా తాగించి జైలుకు వెళ్ళిన వ్యక్తి నాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారంటూ ఆరోపించారు. సుధాకర్‌ వ్యాఖ్యలు సమాజంలో తన మర్యాదకు భం గం కలిగించాయని ఆంజనేయరెడ్డి సుప్రీంకోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. సుప్రీం ధర్మాసనం పరువునష్టం కేసును క్రిమినల్‌ కేసుగా మార్పుచేయాలని రాష్ట్ర ప్రజాప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆదేశించింది. దీంతో మంత్రి సుధాకర్‌పై క్రిమినల్‌ కేసు నమోదుకు ఆదేశించారు.

Updated Date - 2022-11-25T11:48:11+05:30 IST