Bihar: బీహార్లో మరో దారుణం
ABN , First Publish Date - 2022-12-06T05:47:27+05:30 IST
శ్రద్ధావాకర్ ఘటన మరవక ముందే బీహార్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది...
భాగల్పూర్(బీహార్): శ్రద్ధావాకర్ ఘటన మరవక ముందే బీహార్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. పదునైన కత్తితో ఓ మహిళ రొమ్ములు, కాళ్లు, చేతులు నరికి చంపిన ఘటన బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో సంచలనం రేపింది.(Woman) బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో(Bihar Bhagalpur) ఓ మహిళను అత్యంత దారుణంగా హతమార్చిన నిందితుడు షకీల్ మియాన్ (62)ను పోలీసులు అరెస్టు చేశారు.(Arrest)ఈ హత్యకు సహకరించిన మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. భాగల్పూర్ జిల్లా పిర్పైంటి మార్కెట్లో పదునైన కత్తితో నీలందేవి అనే 45 ఏళ్ల మహిళను 10 కత్తిపోట్లతో చంపారు. మహిళ ప్రైవేటు భాగాలతో సహా, రొమ్ములు, కాళ్లు, చేతులు, చెవులు నరకడం సంచలనం రేపింది.
కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను భాగల్పూర్లోని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. హత్యకు ఉపయోగించిన కత్తి, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి, బాధిత మహిళకు మధ్య ఆర్థిక తగాదాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు నిందితుడి వద్ద అప్పు తీసుకుందని, అది తిరిగి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.