former chief minister:మాజీ సీఎం రైలులో ప్రయాణిస్తుండగా ఫోన్ చోరీకి యత్నం...దొంగ అరెస్ట్

ABN , First Publish Date - 2022-10-11T16:57:57+05:30 IST

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే(ex Maharashtra CM Sushilkumar Shinde) మొబైల్ ఫోన్ చోరీకి ఓ దొంగ యత్నించిన(trying to steal) ఘటన...

former chief minister:మాజీ సీఎం రైలులో ప్రయాణిస్తుండగా ఫోన్ చోరీకి యత్నం...దొంగ అరెస్ట్

ముంబయి(మహారాష్ట్ర): మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే(ex Maharashtra CM Sushilkumar Shinde) మొబైల్ ఫోన్ చోరీకి ఓ దొంగ యత్నించిన(trying to steal) ఘటన రైలులో జరిగింది. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే తన స్వస్థలమైన షోలాపూర్ నగరం నుంచి ముంబయికు (Solapur hometown to Mumbai)రైలులో తిరిగి వస్తుండగా అతని మొబైల్ ఫోన్ ను( phone) 23 ఏళ్ల యువకుడు చోరీ చేసేందుకు యత్నించాడు. మాజీ సీఎం షిండేతో కలిసి ఆయన కుమార్తె ప్రణతి(daughter Praniti) రైలులో ప్రయాణిస్తుండగా ఫోన్ చోరీ యత్నం జరిగింది. నిందితుడు షోలాపూర్ లోని మాధా కు చెందిన మందార్ గురవ్ అనే రైతు అని దాదర్ గవర్నమెంటు రైల్వే పోలీసులు చెప్పారు.


 సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన 81 ఏళ్ల షిండే ప్రయాణిస్తున్న రైలు ఉదయం 6 గంటలకు దాదర్ రైల్వేస్టేషనుకు చేరింది. ఆ సమయంలో షిండే టాయ్ లెట్ కు వెళ్లి వస్తుండగా ఆయన ఫోన్ చోరీకి యువకుడు యత్నించాడు. దీంతో షిండే కుమార్తె దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించింది. చోరీ యత్నం కేసులో నిందితుడైన మందార్ గురవ్ ను అరెస్టు చేసి (Man arrested) కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి ఆయన్ని 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపించారు. 



Updated Date - 2022-10-11T16:57:57+05:30 IST