selling daughters: ప్రియుడితో కలిసి మహిళ దారుణం...తన మైనర్ కుమార్తెల విక్రయం

ABN , First Publish Date - 2022-09-30T17:15:16+05:30 IST

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తన మైనర్ కుమార్తెలను విక్రయించిన బాగోతం మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది....

selling daughters: ప్రియుడితో కలిసి మహిళ దారుణం...తన మైనర్ కుమార్తెల విక్రయం

భోపాల్ (మధ్యప్రదేశ్): ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తన మైనర్ కుమార్తెలను విక్రయించిన బాగోతం మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. తన ముగ్గురు మైనర్ కుమార్తెలను విక్రయించినందుకు(selling three minor daughters) మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ, ఆమె ప్రియుడిపై(lover) పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు బాలికలు తప్పించుకుని తాతయ్య వద్దకు వెళ్లి పోలీసులకు సమాచారం అందించడం ఈ బాగోతం బయటపడింది.మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి 12, 14, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు కుమార్తెలను విక్రయించింది.(selling daughters) ఈ కేసులో ఐదుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.


ఇద్దరు పెద్ద బాలికలను రాజస్థాన్ నివాసితులకు ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున దంపతులు విక్రయించారని మహిద్‌పూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆర్‌కె రాయ్ చెప్పారు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని మరో వ్యక్తికి 12 ఏళ్ల చిన్నారిని రూ.1.75 లక్షలకు విక్రయించి పెళ్లి చేశారు.ఈ కేసులో ఐదుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 370, 376 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-09-30T17:15:16+05:30 IST